కంటతడి పెట్టిస్తున్న విష్ణుప్రియ ఎమోషనల్ స్టోరీ!
on Oct 16, 2024
విష్ణుప్రియ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతుంది. బిగ్ బాస్ సీజన్-8 లోకి ఎంట్రీ ఇచ్చి.. మరింత క్రేజ్ సంపాదించుకుంది. మొదట పద్నాలుగు మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ఒక్క కమెడియన్ కూడా రాలేదని బిబి ఆడియన్స్ డిస్సపాయింట్ అయ్యారు. అలాంటి టైమ్ లో నేనున్నానంటూ బిగ్ బాస్ ప్రేక్షకులకు తన కామెడితో ఊరటనిచ్చింది విష్ణుప్రియ. ఏ విషయం అయిన స్పోర్టివ్ గా తీసుకుంటూ చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తోంది విష్ణుప్రియ.
విష్ణుప్రియ వాళ్ళ అమ్మ రీసెంట్ గా చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయం అడ్డుపెట్టుకొని విష్ణు సింపథీ ట్రై చెయ్యాలని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు చలాకీగా నవ్వుతు నువ్విస్తూనే హౌస్ లో ఉంటుంది. ఇక వీకెండ్ లో అయితే చెప్పనవసరం లేదు.. వారం అంతా ఒక ఎత్తు, వీకెండ్ ఒక ఎత్తు అన్నట్టుగా.. వీకెండ్ లో ఏ టాస్క్ ఇచ్చిన తనదే పై చెయ్యి అనిపించుకుంటోంది. డాన్స్ లో తనని ఎవరు బీట్ చెయ్యలేరన్నట్టు ఎప్పుడు హ్యాపీగా ఉండే విష్ణు మనసులో ఎవరికీ తెలియని బాధ కూడా ఉందని తెలుస్తుంది. అయితే తాజాగా వచ్చిన బిబి ప్రోమో లో... మీ నాన్న ఎక్కడ ఉన్నాడని విష్ణుప్రియని గంగవ్వ అడుగుతుంది. నాన్న ఊళ్ళో ఉంటారు.. అమ్మనాన్నలకి గొడవలు కాబట్టి అమ్మ కోసం నాన్న అంటే ఎంత ఇష్టమున్నా, ఎంత మిస్ అయిన మాట్లాడట్లేదని విష్ణుప్రియ అనగానే.. గంగవ్వ ఏడ్చేస్తుంది. దాంతో గంగవ్వని విష్ణుప్రియ హగ్ చేసుకొని విష్ణుప్రియా ఎమోషనల్ అవుతుంది.
విష్ణుప్రియ మనసులో ఎంత బాధున్నా అది ఎక్స్ పోజ్ చేయకుండా ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ప్రోమో చూసిన వాళ్ళంతా విష్ణుప్రియ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో పృథ్వీతో విష్ణుప్రియ క్లోజ్ గా ఉంటుంది. అది స్నేహమా లేక ప్రేమనా అన్న డౌట్ అందరిలోను ఉంది. అయితే తాజాగా రిలీజైన ఈ ప్రోమోలో విష్ణుప్రియ హైలైట్ అయ్యింది. ఇక నాగ మణికంఠ, గంగవ్వ, హరితేజ, రోహిణిల మధ్య సాగిన సీక్వెన్స్ కూడా కామెడీగా ఉంది. ఇక గౌతమ్-అవినాష్ మధ్య జరిగిన నామినేషన్, పృథ్వీ-అవినాష్ మధ్య జరిగిన నామినేషన్లని స్ఫూఫ్ లాగా చేశారు. దాంతో హౌస్ మేట్స్ అంతా ఫుల్ నవ్వేసారు. అయితే ఈ ప్రోమోని బట్టి చూస్తే నేడు జరగబోయే ఎపిసోడ్ ఇటు ఎమోషనల్, అటు ఎంటర్టైన్మెంట్ రెండు ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.